Saturday, April 20, 2024
- Advertisement -

టాస్ గెలిచి విండీస్‌పై బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా…

- Advertisement -

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లాంటి జట్లను సునాయాసంగా ఓడించి కొండంత ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమ్‌ఇండియా… ఓటముల భారాన్ని మోయలేక బరువు దించుకుందామని ఆరాటపడుతున్న వెస్టిండీస్‌తో కాసేప‌ట్లో తలపడనుంది. మొద‌ట టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ స్టేడియంలో మూడు మ్యాచ్‌లాడిన టీమిండియా.. తొలుత బ్యాటింగ్ చేసే అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. దీంతో.. కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. అఫ్గానిస్థాన్‌పై ఆడిన టీమ్‌నే కెప్టెన్ కోహ్లీ ఈ మ్యాచ్‌కీ కొనసాగించాడు.

టోర్నీలో ఇప్పటికే ఐదు మ్యాచ్‌లాడిన భారత్ జట్టు నాల్గింటిలో గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆరు మ్యాచ్‌లాడిన వెస్టిండీస్ జట్టు నాలుగు ఓటములతో ఇప్పటికే సెమీస్ ఆవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భార‌త్ గెలిస్తే సెమీస్ బెర్త్ క‌రార‌వుతుంది. వెస్టిండీస్‌కు ఈ మ్యాచ్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితి. దీంతో ఈ మ్యాచ్‌పై మరింత అంచనాలు పెరిగాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -