- Advertisement -
టెస్ట్ సిరీస్ కు ముందె విండీస్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆజట్టు ఆల్ రౌండర్ కీమో పాల్ గాయం కారణంగా మొదటి టెస్ట్ కు దూరం అయ్యారు.ఎడమ చీలమండ గాయంతో పాల్ తొలి టెస్టు నుంచి వైదొలిగినట్లు విండీస్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతం కీమో పాల్ను జట్టుతో పాటే కొనసాగిస్తున్న విండీస్.. రెండో టెస్టుకు అతను అందుబాటులోకి వస్తాడని ఆశిస్తోంది.తొలి టెస్టులో పాల్ స్థానంలో మరొక ఫాస్ట్ బౌలర్ మిగుల్ కమిన్స్కు చోటు కల్పించింది. వన్డే, టీ20 సిరీస్ ను గెలిచి ఊపుమీదున్న టీమిండియా టెస్ట్ సిరీస్ ను కూడా క్లీన్ స్విప్ చేయాలని పట్టుదలతో ఉంది. నేడు ఆంటిగ్వా వేదికగా వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఇండియా, విండీస్తో మధ్య మొదటి టెస్టు ప్రారంభం కానుంది.