Friday, April 19, 2024
- Advertisement -

కొత్త జెర్సీలతో బరిలోకి దిగనున్న టీమిండియా…

- Advertisement -

గురువారం ఆంటిగ్వాలోమొదటి టెస్టులో విండీస్ తలపడనున్న టీమిండియా కొత్ జెర్సీతో బరిలోకి దిగనుంది. వన్డే, టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న కోహ్లీ సేన టెస్ట్ సిరీస్ పై గురిపెట్టింది. కోహ్లీ సేనతో పాటు విండీస్ ఆటగాల్లు కూడా కొత్త జెర్సీలోనె బరిలోకి దిగనున్నారు.దీనిలో భాగంగా టీమిండియా ఆటగాళ్ల కొత్త జెర్సీలను బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది.

సారథి విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానేతో పాటు యువ సంచలనం రిషభ్‌ పంత్‌లు కొత్త జెర్సీలను ధరించి ఫోటో షూట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో టెస్టు సిరీస్‌కు ఎంపికైన 16 మంది సభ్యులు పాల్గొని సందడి చేశారు.ఆటగాళ్లకు సంబంధించిన ఫోటోలను టీమిండియా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

ఇటీవలె టెస్ట్ మ్యాచ్ లో కొత్త మార్పులు తీసుకొచ్చింది ఐసీసీ. దీనిలో భాగంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాదిరిగానే టెస్టుల్లోనూ ఆటగాళ్ల జెర్సీల వెనక వారి పేర్లు, నంబర్లు కనిపించనున్నాయి. యాషెస్‌ సిరీస్‌ నుంచే ఈ పద్దతి ప్రారంభమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -