విండీస్ టూర్ లో టీ20, వన్డే సిరీస్ ను గెలిచిన టీమిండియా ఆటగాల్లు బీచ్ పార్టీలో సేదదీరారు. నేటి నుంచి రెండు జట్ల మధ్య ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో మొదటి టెస్టు ఆరంభం కానుంది. మ్యాచ్ కు ముందు టీమిండియా ఆటగాల్లు కాస్త సేద తీరుతున్నారు.
ఆంటిగ్వాలోని జాలీ బీచ్లో విరాట్కోహ్లి సహా టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కలిసి కొంత సేపు సరదాగా గడిపారు.అయితే విరాట్ కోహ్లితో కలిసి సిక్స్ ప్యాక్ ఫోజిచ్చిన ఫోటోను బుమ్రా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా, వారిలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ కూడా చేరిపోయాడు. వారి సిక్స్ ప్యాక్కు ముగ్థుడైన యువీ.. ‘ ఓహ్.. ఫిట్నెస్ ఐడల్’ అంటూ కామెంట్ చేశాడు.
కాగా ఈ ఫొటోలో మయాంక్ అగర్వాల్, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, అజింక్యా రహానే, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్తోపాటు టీమిండియా సహాయక సిబ్బంది కూడా ఉన్నారు.