- Advertisement -
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్ట్ సీరిస్లలో భాగంగా జరుగుతున్న మొదటి టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది.తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. 323 పరుగుల విజయలక్ష్యంలో భాగంగా 104/4 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 291 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆసీస్ ఆటగాళ్లలో షాన్ మార్ష్(60), పైనీ(41) రాణించగా, మిచెల్ స్టార్క్(28), ప్యాట్ కమిన్స్(28)ఆకట్టుకున్నారు.భారత బౌలర్లలో బూమ్రా, మహ్మద్ షమీలు అశ్విన్ తలో మూడు వికెట్లు సాధించగా, ఇషాంత్ వికెట్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చతేశ్వర పుజారకు దక్కింది.