భారత జట్టు సీనియర్ వికెట్ కీపర్, మాజీ కెఫ్టెన్ ఎంఎస్ ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చిన యువ కెరటం రిషబ్ పంత్ బ్యాటింగ్, కీపింగ్ లలో విఫలమవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. మరోసారి ఆయన వార్తల్లో నిలిచాడు. అయితే ఈ సారి క్రికెట్ ఆట గురించి కాదు. రిషబ్ పంత్, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలా డేటింగ్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే ఇందుకు కారణం కూడా ఉంది. భారత్, వెస్టీండీస్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20కి ముందు.. పంత్, ఊర్వశి కలిసి ముంబైలోని ఓ ఖరీదైన హోటల్లో డిన్నర్ చేస్తూ కనిపించారు. దాంతో ఈ జోడి డేటింగ్ లో ఉన్నట్లు చర్చ సాగుతోంది. చివరి టీ20 మ్యాచ్లో పంత్ డకౌటయ్యాడు. ఊర్వశితో డిన్నర్ మధురానుభూతుల నుంచి బయటకు రాకపోవడమే మనోడి వైఫల్యానికి కారణం అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ఇషా నేగి అనే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నానని పంత్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక గతంలో ఊర్వశి రౌతెలా టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో డేటింగ్ చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే వీటిని ఇద్దరు కొట్టిపారేశారు. ఇక హార్దిక్ నటాషా స్టాన్కోవిచ్తో ప్రేమలో ఉండంతో ఆ వార్తలు ఆగిపోయాయి. గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్ ఊర్వశిని హార్దిక్ మాజీ ప్రేయసి అని పేర్కొంటూ ఒక వీడియోను అప్లోడ్ చేసింది. ఆ వీడియో చూసిన ఊర్వశి.. దయచేసి ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయోద్దంటూ వేడుకుంది.