- Advertisement -
ఇంగ్లండ్లో టెస్ట్ సీరిస్ను గెలవడమే లక్ష్యంగా ఆ గడ్డ మీద అడుగుపెట్టిన టీంఇండియా కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది.ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ కోల్పోయినా అసలు సిసలు టెస్ట్ క్రికెట్ మజా లభించిందని సగటు ప్రేక్షకుడు అభిప్రాయపడుతున్నాడు.చివరి టెస్ట్లో విజయంపై ఆశలు రేపినా భారత్కు 118 పరుగుల అపజయమే లభించింది.
దీంతో 5 టెస్ట్ల సిరీస్ ఇంగ్లండ్ 4-1తో కైవసం చేసుకుంది. లార్డ్స్ టెస్ట్ మినహా ఇండియా మిగతా మ్యాచ్లు బాగానే ఆడింది.కాని వాటిని విజయాలగా మలుచుకోలేకపోయింది.ఓడినా ఈ సిరీస్ హోరాహోరిగా సాగింది. అసలైన టెస్ట్ క్రికెట్ మజాను ఈ సిరీస్ అందించింది. ఇరు జట్లు విజయం కోసం పోటీపడటంతో అభిమానుల మ్యాచ్ చూసేందుకు వచ్చారు.