- Advertisement -
పాక్ లో పర్యటించేందుకు శ్రీలకం జట్టులోని ప్రధాన ఆటగాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాక్ లో ఆడేందకు వారు విముఖత వ్యక్తం చేశారు. పాకిస్థాన్ లో పర్యటించకుండా తమ ఆటగాళ్లపై భారత్ ఒత్తిడి చేసిందని పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను శ్రీలంక క్రీడల మంత్రి తీవ్రంగా ఖండించారు.
పాకిస్థాన్ లో పర్యటించకుండా తమ ఆటగాళ్లపై భారత్ ఎలాంటి ఒత్తిడి చేయలేదని శ్రీలంక క్రీడామంత్రి హరిన్ ఫెర్నాండో తెలిపారు. 2009 శ్రీలంక పర్యటన సందర్భంలో ఉగ్రదాడి జరిగిన కారణంగానే అక్కడ పర్యటించేందుకు తమ ఆటగాళ్లు భయపడుతున్నారని చెప్పారు.
తమ ఆటగాళ్ల అభిప్రాయాలను తాము గౌరవిస్తామని అక్కడ ఆడటానికి ఆసక్తి చూపుతున్నవారిని మాత్రమే ఎంపిక చేశామన్నారు. పాక్ ను వారి సొంత గడ్డపై ఓడిస్తామన్న నమ్మకం ఉందని క్రీడల మంత్రి ట్విట్ చేశారు.