- Advertisement -
జనవరిలో భారత్ లో పర్యటించే శ్రీలంక జట్టు టూర్ ఖరారయ్యింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ, శ్రీలకం క్రికెట్ బోర్డు విడుదల చేసింది. జింబాబ్వేపై ఐసీసీ నిషేధం విధించడంతో బీసీసీఐ శ్రీలంక జట్టుని ఆహ్వానించింది. శ్రీలంక క్రికెట్ బోర్డు సైతం భారత్లో పర్యటించేందుకు అంగీకరించింది. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు జనవరి, 2020లో మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఈ మూడు టీ20లు జనవరి 5, 7, 10న నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
05 January – 1st T20I, Guwahati
07 January – 2nd T20I, Indore
10 January – 3rd T20I, Pune