Thursday, April 25, 2024
- Advertisement -

చెల‌రేగిన కేదర్‌ జాదవ్‌.. హైద‌రాబాద్ వ‌న్డేలో భార‌త్ ఘ‌న‌విజ‌యం

- Advertisement -

ఆసీస్‌తో జ‌రిగిన మొద‌టి వ‌న్డేలో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ రెండు జట్లు మ‌ధ్య జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌కు హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడిమం వేదిక అయింది. టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకుంది అతిథ్య జ‌ట్టు. నిర్ణిత 50 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖవాజా(50), మ్యాక్స్‌వెల్‌(40) రాణించారు.భారత బౌలర్లలో షమీ, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రాలు తలో రెండు వికెట్లు సాధించగా, కేదర్‌ జాదవ్‌కు వికెట్ తీశాడు. 237 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ త‌గిలింది.

ఓపెన‌ర్ ధావ‌న్ ప‌రుగులు ఏమి చేయ‌కుండానే వెనుదిరిగాడు. కాని త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన విరాట్‌ కోహ్లి(44),రోహిత్‌ శర్మ(37) తో క‌లిసి ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డింపించాడు. ఎంఎస్‌ ధోని(59 నాటౌట్‌), కేదర్‌ జాదవ్‌(81 నాటౌట్‌)లు రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.ఈ మ్యాచ్ గెలుపుతో భార‌త్ ఐదు వ‌న్డేల సిరీస్‌ను 1-0తో లీడ్‌లో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -