- Advertisement -
టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరుపున తన ఖాతాలో 10 వేల పరుగులు చేసి ఐదో భారత క్రికెటర్గా రికార్డులకెక్కాడు.ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ మాత్రమే పదివేల పరుగుల క్లబ్లో ఉండగా ఇప్పుడు ధోనీ వారి సరసన చేరాడు.
అయితే గతంలోనే ఈ మైలు రాయిన చేరుకోవాల్సిన ధోనీ వాయిదా పడింది. భారత్తో విండీస్తో జరిగిన ఐదో వన్డేలో ధోనీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దీంతో 9,999 పరుగుల వద్ద ఆగిపోయిన ధోనీ తాజా వన్డేలో ఆ పరుగు సాధించి రికార్డు పుస్తకంలో చోటు సంపాదించాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో అర్థసెంచరీ సాధించి 10వేల పరుగుల మైలురాయి అందుకున్నారు.