గెలుపే లక్ష్యంగా ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన ఇండియాన్ టీం ముందు సువర్ణ అవకాశం ఉంది. ఆడిలైడ్ వేదికగా జరుగుతన్న మొదటి టెస్ట్లో భారత్ జట్టు పట్టు బిగించింది. ఓవర్నైట్ స్కోరు 191/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 235 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితం రోజు స్కోరుకు 11 పరుగులు జోడించిన ట్రావిస్ హెడ్ (72)తో పాటు హాజల్వుడ్ (0)ను వరుస బంతుల్లో ఔట్ చేసిన షమీ ప్రత్యర్థి ఇన్నింగ్స్కు తెరదించాడు.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్లు శుభారాంభం ఇచ్చారు. మొదటి వికెట్కు 50 పరుగులు పైగా జోడించారు. ఓపెనర్ రాహుల్ (67 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్) జోరు, వన్డౌన్ బ్యాట్స్మన్ పుజారా (40 బ్యాటింగ్; 4 ఫోర్లు) ఓర్పు, కోహ్లి (34; 3 ఫోర్లు) తోడ్పాటుతో రెండో ఇన్నింగ్స్లో ప్రస్తుతం భారత్ మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులతో నిలిచింది. చేతిలో ఏడు వికెట్లుండగా, 166 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్పై పట్టు బిగించింది.