Friday, April 19, 2024
- Advertisement -

షాన్ మార్ష్ సెంచ‌రీ… భార‌త్‌కు భారీ టార్గెట్ ఇచ్చిన ఆసిస్..

- Advertisement -

అడిలైడ్‌లో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో ఆసిస్ భారీ స్కోరు న‌మోదు చేసింది. 298 ప‌రుగుల భారీ క్ష్యాన్ని భార‌త్ ముందుంచింది. వన్డేలో షాన్ మార్ష్ (131: 123 బంతుల్లో 11×4, 3×6) సెంచరీ సాధించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. మార్ష్‌కు తోడు మ్యాక్స్‌వెల్‌ 37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 48 పరుగులు చేశాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ ఓపెన‌ర్లు నిరాశ ప‌రిచారు. ఓపెనర్లు అరోన్ ఫించ్ (6: 19 బంతుల్లో), అలెక్స్ కేరీ (18: 27 బంతుల్లో 2×4) నిరాశపరిచినా.. పట్టుదలతో క్రీజులో నిలిచిన షాన్ మార్ష్ ఆఖర్లో హిట్టర్ మాక్స్‌వెల్ (48: 37 బంతుల్లో 5×4, 1×6)తో కలిసి జట్టుకి పోరాడే స్కోరు అందించాడు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (4/44) ఆకట్టుకోగా.. కెరీర్‌లో తొలి వన్డే ఆడిన హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (0/76) తేలిపోయాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -