మిస్టర్ కూల్గా ధోనీకీ మంచి పేరుంది. గ్రౌండ్లో ఎంత కూల్ గా ఉంటాడో ….అందరికి తెలిసిందే. అయితే ఒక్కోసారి ఆటగాల్లపై కోప్పడుతుంటాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో వన్డేలో ఓ క్షణంపాటు ధోనీ సహనం కోల్పోయాడు. డ్రింక్స్ అందించేందుకు మైదానంలోకి వచ్చిన 12వ ఆటగాడు, ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్పై కోప్పడ్డాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లి శతకంతో పాటు ధోని చిరస్మరణీయ ఇన్నింగ్స్ తోడవడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే టీమిండియా ఇన్నింగ్స్ సందర్భంగా మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగుతున్న సమయంలో అంపైర్లు డ్రింక్స్ బ్రేక్ ఇచ్చారు.
అయితే ఖలీల్ పిచ్పై పరుగెత్తుకుంటూ రావడంతో ధోనికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఎక్కడ నడుస్తున్నావ్? పిచ్ పక్క నుంచి రావొచ్చు కదా అంటూ ఖలీల్పై ధోని గుస్సా అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.