ఆఖరిపోరాటిని ఆసిస్, టీమిండియాలు ససిద్దమవతున్నాయి. ఇప్పటికే సిరీస్ 1-1తో సమంగా ఉంది. శుక్రవారం మెల్బోర్న్లో జరగబోయే నిర్ణాయాత్మక మూడో వన్డేతో ఆస్ట్రేలియాలో టీమిండియా టూర్ ముగియనుంది. మూడో వన్డేలో కూడా గెలిచి టూర్ను ఘనంగా ముగించాలని టీమిండియా భావిస్తోంది. అటు టీ20 సిరీస్ సమమై, టెస్ట్ సిరీస్ కోల్పోయిన ఆసీస్.. సొంతగడ్డపై కనీసం వన్డే సిరీస్నైనా గెలవాలని పట్టుదలతో ఉంది.
అయితే రెండు జట్లు మార్పులతో బరిలోకి దిగుతున్నారు. భారత్ ఒక మార్పు, ఆసిస్ రెండు మార్పులతో మూడో వన్డేలో తలపడునున్నాయి. సీనియర్ స్పిన్నర్ నేథన్ లయన్ స్థానంలో ఆడమ్ జంపా, జేసన్ బెహ్రన్డార్ఫ్ స్థానంలో బిల్లీ స్టాన్లేక్ టీమ్లోకి వచ్చారు. టెస్ట్ సిరీస్లో రాణించిన లయన్.. రెండు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడంతో అతన్ని పక్కన పెట్టారు. అటు టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తున్నది. రెండో వన్డే ఆడిన పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో ఆల్రౌండర్ విజయ్ శంకర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.