- Advertisement -
ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక వన్డేలో భారత్ విజయంకోసం పోరాడుతోంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 231 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా మూడో వికెట్ చేజార్చుకుంది. జట్టు స్కోర్ 113 పరుగుల వద్ద కోహ్లి (46: 66 బంతుల్లో 3 ఫోర్లు) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. రిచర్డ్సన్ వేసిన 29 ఓవర్ చివరి బంతి కోహ్లి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ క్యారీ చేతిలో పడింది. దీంతో కోహ్లి నలుగు పరుగుల తేడాతో అర్ధశతకాన్ని చేజార్చుకున్నాడు. 33 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. క్రీజ్లో ధోనీ (47) జాదవ్ (18) పరుగులతో ఉన్నారు. భారం అంతా ధోనీపైనే పడింది.