Friday, April 19, 2024
- Advertisement -

ఆసిస్ కెప్టెన్ టిమ్‌పైన్‌కు కౌంట‌ర్ ఇచ్చిన రోహిత్‌..

- Advertisement -

ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచులో రెండో రోజు గురువారం ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తుండడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ నిస్పృహకు గురైనట్లు కనిపించాడు.

నాథన్ లైన్ బౌలింగులో భారత బ్యాట్స్ మన్ రోహిత్ శర్మను పైన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. సిక్స్ కొడుతావా, కొట్టు చూద్దామంటూ రెచ్చగొట్టాడు. కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ స్లెడ్జింగ్‌పై టీమిండియా క్రికెటర్‌ రోహిత్‌ శర్మ కౌంట‌ర్ ఇస్తూ మంచి ఆఫ‌ర్ ఇచ్చాడు. తాజాగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో పైన్‌ సెంచరీ చేస్తే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టులోకి తీసుకుంటామన్నాడు. తానే స్వయంగా తమ ముంబై జట్టు బాస్‌తో మాట్లాడి జట్టులోకి తీసుకునేలా ఒప్పిస్తానని హామీ ఇచ్చాడు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టిమ్‌పైన్ 85 బంతులు ఎదుర్కొని పట్టుదలతో క్రీజులో నిలిచినా చేసిన పరుగులు 22 మాత్రమే. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అతను వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పేలవంగా ఔటయ్యాడు. మరి రెండో ఇన్నింగ్స్‌లోనైనా.. రోహిత్ శర్మ సవాల్‌ని టిమ్‌పైన్ స్వీకరిస్తాడామో..? చూడాలి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -