ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో ఇప్పటి వరకు ఎక్కడకూడా జరగని ఆరుదైన సంఘటన చోటుచేసుకుంది. తొలి రెండు వన్డేల్లో భారత్ విజయం సాధించగా, మూడో వన్డే ఆసీస్ గెలుపును అందుకుంది. ఇప్పటికే మూడు వన్డేలు ముగియగా.. ఒక బంతి కూడా తేడా లేకుండా.. సరిగ్గా మూడు వన్డేల్లోనూ టీమిండియా 48.2 ఓవర్లే బ్యాటింగ్ చేసింది. ఇది యాదృశ్చికమే అయినా.. ఇప్పుడు ఈ అరుదైన రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మొదటి వన్డేలో ఆస్ట్రేలియా నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.2 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. నాగ్పూర్లో జరిగిన రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 48.2 ఓవర్లలో 250 పరుగులకి ఆలౌటవగా.. లక్ష్య ఛేదనలో తడబడిన ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌటైంది. ఇక మూడో వన్డేలోనూ మ్యాచ్లోనూ సరిగ్గా 48.2 ఓవర్ల వద్దే భారత్ ఆలౌట్ అయింది.