మహిళల టి20 ప్రపంచకప్లో టీమిండియాకు మరో ఘన విజయం. ఎడమ చేతివాటం ఓపెనర్ స్మృతి మంధాన (83) ధనాధన్ ఇన్నింగ్స్కు స్పిన్నర్ల మాయాజాలం తోడైన వేళ కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను మన జట్టు 48 పరుగుల తేడాతో ఓడించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్… ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతికి తోడుగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ( 43) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
ఛేదనలో భారత స్పిన్ చతుష్టయం అనూజ పాటిల్ (3/15), రాధా యాదవ్ (2/13), పూనమ్ యాదవ్ (2/28), దీప్తిశర్మ (2/24) ఉచ్చులో చిక్కిన ఆసీస్ 19.4 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. ఎలీస్ పెర్రీ (39 నాటౌట్) టాప్ స్కోరర్. ఈ విజయంతో భారత్ గ్రూప్ ‘బి’లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి టాపర్గా నిలిచింది. గ్రూప్ ‘ఎ’లో సెమీస్ చేరిన వెస్టిండీస్, ఇంగ్లండ్లలో ఒకదానితో తలపడనుంది.