Tuesday, April 16, 2024
- Advertisement -

ఆసిస్‌తో త‌ల‌ప‌డే టీమిండియా జ‌ట్టు…?

- Advertisement -

న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిసింది. ఒన్డే సిరీస్‌ను గెలిచిన టీమిండియా టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ఇక‌ స్వదేశంలో ఆసిస్‌తో జ‌రిగే సిరీస్‌కు భార‌త్ సిద్ద‌మ‌వుతోంది. ప్రపంచ కప్ ఆడటానికి ముందు భారత జట్టు ఆడనున్న ఆఖరి పోరాటం ఇదే. సొంత గ‌డ్డ‌పై ఆసిస్‌తో పోరుకు సిద్ద‌మ‌వుతోంది. ఆసిస్‌తో త‌ల‌ప‌డే జ‌ట్ట‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ సిరీస్‌నుంచి విశ్రాంతిని తీసుకున్న కోహ్లీ, బూమ్రా తిరిగి జ‌ట్టులోకి రానున్నారు. రొటేషన్ పద్ధతిలో ఆటగాళ్లకు విరామమిస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్ 15మందితో కూడిన జట్టును ప్రకటించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పుడు రోహిత్‌, మొహ్మద్ షమీ, భువనేశ్వర్‌లకు విరామం కల్పించనున్నారు. అలా అయితే ఆ మిగిలిసన స్థానాల్లో ఎవరు ఆడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక వేల శిఖ‌ర్‌కు జోడీగా కెఎల్ రాహుల్ ను ఆడిస్తారా లేకా రిష‌బ్ పంత్‌ను ఆడిస్తారా అన్న‌ది సందిగ్ధంగా మారింది. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో అంబటి రాయుడు లేదా రిషబ్ పంత్‌ని ఆడిస్తారనే మరో వాదన ఉంది.ఇక ఐదో స్థానం కోసం దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, కేదర్ జాదవ్‌లలో మంచి పోటీ కనిపిస్తుంది. ధోనీ ఆరో స్థానంలో, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఏడులో బరిలోకి దిగ‌నున్నారు. మ‌రో వైపు బౌల‌ర్ల‌ను ఎంపిక చ‌య‌డం కూడా క‌ష్టంగా మారింది. ఖ‌లీల్, ఉమేష్ యాద‌వ్‌కు మ‌రో సారి అవ‌కాశం ఇవ్వాల‌ని సెల‌క్ట‌ర్లు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -