- Advertisement -
వైజాగ్ వేదికగా టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే జరుగుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్(102) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు పోటాపోటీగా ఆడుతుండంతో స్కోరు అమంతం పెరిపోయింది.
ఈ క్రమంలో రోహిత్ మొదట సెంచరీ చేయగా.. ఆ తర్వాత రాహుల్ కూడా సెంచరీ చేశాడు. టీమిండియా ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు విండీస్ బౌలర్లు చేయని ప్రయత్నమంటూ లేదు. కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఆరుగురు బౌలర్లను ప్రయోగించినా సెంచరీలు చేయకుండా నిరోధించలేకపోయారు.
ప్రస్తుతం టీమిండియా స్కోరు 37.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 232 పరుగులు. కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఆడిన తొలి బంతికే వెనుదిరగడంతో వైజాగ్ ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ (120) కు జతగా అయ్యర్ ఉన్నాడు.