Wednesday, April 24, 2024
- Advertisement -

ధోనీ, కపిల్ దేవ్‌లను క్రాస్ చేసిన జడేజా.. రికార్డు..!

- Advertisement -

న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ ను టీమిండియా చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఇంకో మ్యాచ్ ఉండగానే న్యూజిలాండ్ వరసగా రెండు మ్యాచులు గెలిచి.. విజయం దక్కించుకుంది.

రెండో వన్డేలో టీమిండియాను గెలిపించేందుకు చాలా ప్రయత్నించిన రవీంద్ర జడేజా ( 55, 75 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ ) హాఫ్ సెంచరీ కూడా వృథా అయ్యింది. అయితే ఈ హాఫ్ సెంచరీతో అరుదైన రికార్డు అందుకున్నాడు. భారత లెజండ్రీ మాజీ కెప్టెన్లు.. ధోనీ, కపిల్ దేవ్‌లను సైతం క్రాస్ చేసి..ఎక్కువ అర్దసెంచరీలు చేసిన 7వ నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఇప్పటివరకు జడేజా ఈ స్థానంలో 77 సార్లు బరిలోకి దిగి 7 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. వీటిలో 26 సార్లు నాటౌట్‌గా నిలవడం విశేషం. 83.70 స్రైక్ రేటుతో 7వ స్థానంలో 1520 పరుగులు చేశాడు జడ్డూ. కివీస్‌తో రెండో వన్డే ముందు వరకు ఆరేసి అర్ధసెంచరీలతో కపిల్ దేవ్, ధోనీలు సమానంగా ఈ రికార్డును షేర్ చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -