Friday, April 19, 2024
- Advertisement -

టీ20ల్లో ధోనీ రికార్డ్‌‍ని బద్దలు కొట్టబోతున్న విరాట్ కోహ్లీ..!

- Advertisement -

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు దగ్గరలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు అయిపోయాయి. ఈ రెండు మ్యాచుల్లో కోహ్లీ 45, 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక మూడో టీ20 మ్యాచ్ హామిల్టన్ వేదికగా బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రారంభంకానుంది.

హామిల్టన్ టీ20లో విరాట్ కోహ్లీ 25 పరుగులు చేయగలిగితే..? టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు. కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోనీ 1,112 పరుగులతో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. విరాట్ కోహ్లీ 1,088 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. దీంతో.. కోహ్లీ మరో 25 పరుగులు చేస్తే..? కెప్టెన్‌గా ధోనీ నెలకొల్పిన రికార్డ్‌ బ్రేక్‌కానుంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ 1,273 పరుగులతో నెం.1 స్థానంలో ఉండగా.. ఆ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 1,148 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత ధోనీ (1,112), విరాట్ కోహ్లీ (1,088) టాప్-4లో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -