న్యూజిలాండ్ వన్డే సిరీస్లో భారత విఫలం అయింది. అయితే భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇక్కడ విఫలం కావడం ప్రధానమైన విషయమే. బుమ్రా విఫలమవడంపై ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై బౌలర్ మహ్మద్ షమీ స్పందించాడు.
మూడు వన్డేల ఈ సిరీస్లో 30 ఓవర్లు బౌలింగ్ చేసి 167 పరుగులిచ్చాడు బుమ్రా. కానీ.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో.. ఇక బుమ్రా పని అయిపోయిందంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 21 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ మొదలవుతుంది. బుమ్రాపై వస్తున్న విమర్శల గురించి షమీ మాట్లాడుతూ.. ” గత ఏడాది వరకూ బుమ్రా అద్భుత బౌలింగ్ చేశాడు. కానీ గత రెండు మ్యాచ్ల్లో అతను అంచనాల్ని అందుకోలేకపోయాడు.
అందుకని గతాన్ని మర్చిపోయి బుమ్రాను విమర్శిస్తారా ? అభిమానులు పాజిటివ్ గా మాట్లాడితే.. ఆటగాళ్లకి ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఆటగాడ్ని కామెంట్ చేయడం చాలా సులువు. కానీ.. గాయపడిన తర్వాత మళ్లీ సదరు ఆటగాడు పుంజుకోవాలంటే కొంత సమయం పడుతుంది. ఆ టైమ్లో ప్రోత్సహించే ధోరణిలో మాట్లాడాలి తప్ప.. నెగిటివ్గా కాదు’ అని మహ్మద్ షమీ ఘాటుగా స్పందించాడు.