- Advertisement -
ఐపీఎల్ సీజన్ అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడుతోంది. టాస్ గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని ఫిల్డింగ్ ఎంచుకున్నారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయిచిన విషయం తెలిసిందే. ప్రారంభోత్సవానికి ఖర్చేచేసె 20 కోట్ల నిధులను పుల్వామా అమరవీరుల కుంటుంబాలకు ఇచ్చింది.
2008లో ప్రారంభమైన ఐపీఎల్లో ఇప్పటి వరకూ 11 సీజన్లు ముగియగా.. మొత్తం 22 సార్లు చెన్నై, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఇందులో చెన్నై జట్టు రికార్డు స్థాయిలో 14 మ్యాచ్ల్లో గెలుపొందగా.. బెంగళూరు 7 మ్యాచ్ల్లో విజయం సాధించింది.