Thursday, April 25, 2024
- Advertisement -

పంజాబ్‌ని గడగడలాడించిన ఢిల్లీ క్యాపిటల్స్‌

- Advertisement -

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిలకడగా రాణిస్తుంది. గత మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుపై ఎదురైన ఓటమికి ప్రతికారం తీర్చుకుంది. శనివారం ఢిల్లీ ఫిరోషా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 7 వికెట్లకు 163 పరుగులు చేసింది.

క్రిస్‌ గేల్‌ మరోసారి తన బ్యాట్‌కు పని చెప్పాడు. 37 బంతుల్లోనే 69(6 ఫోర్లు, 5 సిక్స్‌లు) పరుగులు చేశాడు. గేల్‌ మినహా మిగిలిన బ్యాట్‌మ్యాన్‌ ఎవరు పెద్దగా రాణించలేదు. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ధావన్‌ (56‌), అయ్యర్‌ (58‌) పరుగులు చేసి తమ జట్టకు విజయాన్నిందించారు. అజేయ అర్ధ సెంచరీ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -