Thursday, April 25, 2024
- Advertisement -

టాస్ గెలిచి హైద‌రాబాద్‌పై ఫిల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌

- Advertisement -

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా ప్లేఆఫ్ రేసులో మ‌రో ర‌స‌వ‌త్త‌ర మ్యాచ్‌కు సిద్దం అయ్యింది. హైదరాబాద్‌తో ఈరోజు జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. విశాఖపట్నం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. తాజా సీజన్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడి కేవలం ఆరింట్లో మాత్రమే గెలుపొందిన హైదరాబాద్ ల‌క్కీగా 12 పాయింట్లతో ప్లేఆఫ్‌కి చేరింది.మరోవైపు ఢిల్లీ జట్టు లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఏకంగా 9 మ్యాచ్‌ల్లో విజయాల్ని అందుకుని 18 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు శుక్రవారం వైజాగ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌తో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -