ఐపీఎల్ తాజా సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. సోమవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఘన విజయం సాధించింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్లో కూడా విజయం సాధించింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.
డేవిడ్ మిల్లర్ (43), సర్ఫరాజ్ ఖాన్ (39) రాణించారు. అనంతరం 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (39), ఇంగ్రామ్ ( 38) రాణించినప్పటికి తమ జట్టుకు విజయాన్నిందించలేకపోయారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్ స్యామ్ కరన్ హ్యాట్రిక్ సాధించి తమ జట్టుకు విజయాన్ని సాధించి పెట్టాడు. ఈ మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ధోని నాయకత్వంలోని చైన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటి స్థానంలో ఉంది.