Thursday, March 28, 2024
- Advertisement -

టాస్ గెలిచి పంజాబ్‌పై ఫిల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ..

- Advertisement -

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మొహాలి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఢిల్లీ జ‌ట్టు ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతోంది. అమిత్‌ మిశ్రా స్థానంలో అవేశ్‌ ఖాన్‌ జట్టులోకి వచ్చినట్లు శ్రేయాస్‌ చెప్పాడు. శనివారం కోల్‌కతాతో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ క్రికెటర్‌ పృథ్వీ షా(99) మెరుపు బ్యాటింగ్‌తో ఢిల్లీని అదుకున్న విషయం తెలిసిందే. టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లాడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడి.. రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్‌పై గెలుపొందింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా మూడు మ్యాచ్‌లాడగా.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి.. ముంబయి, కోల్‌కతాపై విజయం సాధించింది. ఇరు జ‌ట్ల‌లోను మంచి హిట్ట‌ర్లు ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -