- Advertisement -
వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్ X సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. వాంఖడేలో ఈరోజు జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
తాజా సీజన్లో 12 మ్యాచ్లాడిన ముంబయి జట్టు ఏడు మ్యాచ్ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. ఆడిన 12 మ్యాచ్ల్లో ఆరింట్లో మాత్రమే విజయం సాధించిన హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టులో స్వల్ప మార్పులు చేశారు. డేవిడ్ వార్నర్ స్థానంలో మార్టిన్ గుప్తిల్ను తీసుకున్నారు. ఈ మ్యాచ్లో ముంబయ్ గెలిస్తే ప్లేఆఫ్ బెర్తు ఖాయంకానుంది.