- Advertisement -
జట్టులో స్టార్ బ్యాట్స్ మేన్లు ఉన్నా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేని ఘోర స్థితిలో ఉంది ఆర్సీబీ పరిస్థితి. ఈ ఐపీఎల్ సీజన్లో విజయాన్ని నమోదు చేయని జట్టు ఉందంటి అది కోహ్లీ జట్టునే. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో గెలుస్తుందనుకున్న ఆర్సీబీ రస్సెల్ మిస్సైల్ ధాటికి ఓడింది. రస్సెల్ 13 బంతుల్లో 48 పరుగులతో విధ్వంసకర బ్యాటింగ్ చేయడంతో ఐదు బంతులు మిగిలి ఉండగానే కోల్కతా విజయాన్ని అందుకుంది. దీంతో నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కోహ్లీని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్లో వరుసగా ఐదు మ్యాచ్లు ఓడిన జట్టుగా చెత్త రికార్డుల్లో చేరింది. ఇప్పటి వరకూ విజయాల ఖాతా తెరవలేకపోయిన ఆర్సీబీపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.