- Advertisement -
2019 ఐపీఎల్ మ్యాచ్లు భారత్లో కాకుండే వేదిక మారే అవకాశాలు పుస్కలంగా ఉన్నాయి. వేదిక మారే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు సూచన ప్రాయంగా చెప్పింది. దీంతో భారత్ అవతల ఈ సారి మ్యాచ్లు నిర్వహించే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మ్యాచ్ లను దక్షిణాఫ్రికా లేదా యూఏఈ వేదికల్లో నిర్వహించేందుకు బీసీసీఐ ముందస్తు సన్నాహాలు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలు, మ్యాచ్లు ఒకేసారి జరిగితే భద్రతా పరంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ఈ ఆలోచన చేస్తోంది.
గతంలోనూ 2009లో దక్షిణాఫ్రికాలోను, 2014లో సగం మ్యాచ్లు యూఏఈలో నిర్వహించారు. ‘ఏమైనా ఎన్నికల షెడ్యూల్ విడుయ్యాకే వేదిక, తేదీలు ఖరారు చేస్తాం’ అని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్శుక్లా వెల్లడించారు