- Advertisement -
పరుగుల మిషన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. సురేష్రైనా తర్వాత ఆ ఘనత సాధించిన రెండో క్రికెటర్ కోహ్లీ. కొన్ని సీజన్లుగా అద్భుతమైన ఫామ్ లో కనిపిస్తోన్న కోహ్లీ.. తాజాగా ఐపీఎల్ లో అత్యధిక పరుగులు బాదిన రెండో ప్లేయర్ గానే కాకుండా 5వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
ముంబయితో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో 46 పరుగులు చేసి ఐపీఎల్లో ఐదు వేల పరుగుల క్లబ్లో చేరాడు. 5వేల పరుగులను చేరుకోవడానికి సురేశ్ రైనా తీసుకున్న ఇన్నింగ్స్ ల కంటే తక్కువ సమయంలో కోహ్లీ పూర్తి చేయగలిగాడు. రైనా 178 మ్యాచుల్లో 5034 పరుగులు చేయగా కోహ్లీ 165 మ్యాచుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు.