- Advertisement -
రవిచంద్రన్ అశ్విన్ ప్రాంచైజీ మారింది. గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్ తరుపున ఆడనున్నారు. 2018 సీజన్లో రూ.7.6 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ సారథ్య బాధ్యతలూ అప్పజెప్పింది. రెండు సీజన్లలో అశ్విన్ జట్టు 12 మ్యాచ్ల్లో గెలిచి, 16 మ్యాచ్ల్లో ఓడింది.
వచ్చే ఐపీఎల్ సీజన్ కు యువ స్పిన్నర్ ను తీసుకోవాలని పంజాబ్ భావించింది. దీంతో నగదు ఒప్పందంపై అశ్విన్ ను ఢిల్లీకి బదలాయించింది. అశ్విన్ ను తీసుకోవాలని చివరి వరకూ పోటీలో నిలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు, చివరికి విఫలమైంది.అశ్విన్ ఫ్రాంచైజీ మార్పు అంశంపై బీసీసీఐ నుంచి త్వరలో ప్రకటన రానుంది.