శ్రీలంకతో ఇటీవలే జరిగిన మూడు టీ20ల సిరీస్లో భారత నిలకడగా రాణిచింది. శుక్రవారం రాత్రి భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ముగియడంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ని ప్రకటించింది.
బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ బాబర్ అజామ్ 879 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. కేఎల్ రాహుల్ 760 పాయింట్లతో 6వ ప్లేస్ లో ఉన్నారు. ఇక శ్రీలంకపై టీ20 సిరీస్లో కుర్రాళ్లకి అవకాశం ఇవ్వడం కోసం బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి వెళ్లిన విరాట్ కోహ్లీ 683 పాయింట్లతో 9వ స్థానంతో దక్కించుకున్నాడు. భారత్ తరఫున టాప్-10లో ఈ ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కింది.
ఇండోర్ టీ20లో 17 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ.. పుణె టీ20లో 17 బంతుల్లో 26 పరుగులు చేసి రనౌటయ్యాడు. ఈ రెండు మ్యాచ్ల్లో వరుసగా 4, 6 స్థానాల్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయడంతో.. అతనికి ఎక్కువగా పరుగులు చేసే ఛాన్స్ రాలేదు. ఐసీసీ వన్డే, టెస్టు ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ నెం.1 స్థానంలో కొనసాగుతున్నారు.