Saturday, April 20, 2024
- Advertisement -

డికాక్ ఆఫ్ సెంచ‌రీ…పంజాబ్ విజ‌య‌ల‌క్ష్యం 177

- Advertisement -

ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబ‌య్ గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు చేసింది. 20 ఓవ‌ర్ల‌కి 7 వికెట్లు కోల్పోయి 176 ప‌రుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(60: 39 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకంతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(32: 18 బంతుల్లో 5ఫోర్లు), హార్దిక్ పాండ్య(31: 19 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్) కీలక సమయాల్లో రాణించారు. మిడిలార్డ‌ర్ బ్యాట్స్ మేన్ ఎవ‌రూ చెప్పుకోద‌గ్గ ఆట‌న ప్ర‌ద‌ర్శించ‌లేదు.

సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన మురుగన్ అశ్విన్(2/25) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్(11), యువరాజ్ సింగ్(18)లను పెవిలియన్ పంపి ముంబై దూకుడును కొంతసేపు అడ్డుకున్నాడు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ(2/42), హార్డస్(2/40) రెండు వికెట్లు తీయగా ఆండ్రూ టై ఒక వికెట్ తీశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -