Wednesday, April 24, 2024
- Advertisement -

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికి శ్రీలంక స్టార్ బౌల‌ర్‌..

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లుకుతున్నారు క్రికెట‌ర్లు.విండీస్ స్టార్ క్రిస్ గేల్ ఇప్ప‌టికే రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. సొంత దేశంలో భార‌త్‌తో జ‌రిగే సిరీసే చివ‌రిద‌ని తెలిపారు. తాజాగా శ్రీలంక పాస్ట్ బౌల‌ర్ ల‌సిత్ మాలింగ కూడా అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికారు.బంగ్లాదేశ్‌తో ఈ నెల 26న మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ అనంతరం మలింగ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్టు ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నె తెలిపాడు.

బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో 36 ఏళ్ల మలింగ కూడా ఉన్నాడు. విలేకరుల సమావేశంలో స్కిప్పర్ కరుణరత్నె మాట్లాడుతూ.. మలింగ తొలి వన్డే మాత్రమే ఆడతాడని ప్రకటించాడు. మ్యాచ్ ముగిశాక రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తెలిపాడు. సెలక్టర్లకు అతడు ఏం చెప్పాడో తనకు తెలియదని, కానీ తనకు మాత్రం రిటైర్మెంట్ గురించి చెప్పాడని వివరించాడు.

17 జూలై 2004న అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మలింగ 36 ఏళ్ల మలింగ 15 ఏళ్ల కెరీర్‌లో 225 వన్డేల్లో 29.02 సగటుతో 335 వికెట్లు పడగొట్టాడు. మురళీధరన్‌ (523), చమిందా వాస్‌ (399) తర్వాత వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన లంక బౌలర్‌గా అతను నిలిచాడు. మలింగ 2011లోనే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -