ఏచిన్న అవకాశం వచ్చినా బీసీసీఐ మీద ఆరోపనలు….. చేసె పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారీ షాక్ నే ఇచ్చింది బీసీసీఐ . భారత్ … పాకిస్థాన్ మధ్యనున్న విబేధాల కారనంగా పాక్తో క్రికెట్ మ్యాచ్లు రద్దయిన సంగతి తెలిసందే.
ఇదే అదునుగా భావించిన పీసీబి రెండు బోర్డులు కుదుర్చుకున్న ఒప్పందం ప్రాకారం ద్వైపాక్షిక సిరీస్లు ఆడనందుకు సంభవించిన నష్టాన్ని పూడ్చుకొనేందుకు పీసీబీ పరిహారం కోరుతూ బీసీసీఐకి గతవారం నోటీసులు పంపించింది..
పీసీబీ పంపిన నోటీసులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.రెండు బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందానికి కచ్చితంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదనే సమాధానం వచ్చిందనిని పీసీబీ ఛైర్మన్ షహర్యార్ఖాన్ తెలిపారు. అయితే వారు కొన్ని అంశాలు లేవనెత్తారని …. మ్యాచ్ల అంగీకార ఒప్పందం చట్టబద్దం కాదంటూ సమాధానం ఇచ్చిందన్నారు.
{loadmodule mod_custom,Side Ad 1}
పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తోందన్న కారనంగా ఇరు దేశాల మధ్య ఉన్న వైరంతో క్రికెట్ మ్యాచ్లు జరగడంలేదు. అందుకే ఇండో-పాక్ సిరీస్లకు తమ ప్రభుత్వం నుంచి అనుమతి లేదని ఇక మాతో ఆడలేమని చెప్పారు’ అని షహర్యార్ పేర్కొన్నారు. కాగా ఒప్పందాన్ని ఐసీసీ సమక్షంలో చేసుకున్నందున పరిహారం కోరుతూ ఐసీసీ వివాద పరిష్కార వేదికను తాము సంప్రదిస్తామని అన్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read