- Advertisement -
ప్రపంచకప్ తర్వాత క్రికెట్ దూరంగా ఉంటున్న మహేంద్ర సింగ్ ధోని సొంత రాష్ట్రజార్ఖండ్ లో బిజీగా గడుపుతున్నారు. జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన బిలియర్డ్స్ క్రీడల్లో పాల్గొన్నాడు. అంతకుముందు న్యూయార్క్లో గోల్ఫ్ ఆడుతూ కనిపించారు.తనకు లభించిన విశ్రాంతి సమయాన్ని ఉల్లాసంగా గడుపుతున్నాడు ధోని. ఇదలా ఉంటె ధోనిని విందుకు ఆహ్మానించారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.
రాష్ట్రపతి ప్రస్తుతం మూడు రోజుల పర్యటన నిమిత్తం జార్ఖండ్ లో పర్యటిస్తున్నారు.రాష్ట్రపతి ఆదివారం గుమ్లా జిల్లాలో పర్యటించాల్సి ఉండగా, భారీవర్షాల వల్ల ఆయన పర్యటన రద్దు అయింది. దీంతో రాంచీలోని రాజ్భవన్ లో బస చేసిన రాష్ట్రపతి ఆదివారం రాత్రి విందుకు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని ఆహ్వానించారు.