Friday, April 26, 2024
- Advertisement -

సింగర్‌ గా మారిన ధోనీ.. ఏ పాట పాడరంటే ?

- Advertisement -

భారత జట్టు మాజీ కెఫ్టెన్ ఎంఎస్ ధోనీ కొత్త అవతారం ఎత్తాడు. ఫ్యామిలీతో కల్సి సరదాగా గడిపిన ఓ కార్యక్రమంలో ఫ్రెండ్స్ తీ కలిసి ఆడిపాడారు ధోనీ. దాంతో తనలో ఉన్న మరో ట్యాలెంట్ ను బయటకు తీశారు. ప్రపంచ కప్ 2019 సెమీస్‌ అనంతరం ధోనీ తాత్కాలిక విరామం తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సమయంను ధోనీ తన ఫ్యామిలీ సభ్యులతో గడుపుతున్నారు. ప్రధానంగా తన కూతురు జీవాతో కలసి ఆయన సందడి చేస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన కుటుంబంతో కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ తన స్నేహితుడితో కలిసి జుర్మ్‌ అనే బాలీవుడ్ సినిమాలోని జబ్ కోయ్ బాత్ బిగాద్ జయా అనే పాటను మహీ పాడి అందర్ని ఆశ్చర్యపరిచారు.

ధోనీ స్నేహితురాలు, టెలివిజన్ నటి ప్రీత్ సిమోస్ ఈ వీడియోను తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్ చేస్తున్నా నన్ను చంపకు అంటూ తన ఇన్‍స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వీడియో పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.instagram.com/p/B5pFCVtpR2J/?utm_source=ig_embed

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -