- Advertisement -
ఐపీఎల్ తాజా సీజన్లో రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు నిలకడగా రాణిస్తుంది. గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటిల్స్ జట్టుపై ఘన విజయం సాధించింది ముంబై ఇండియన్స్. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 168 పరుగులు చేసింది.రోహిత్ శర్మ(30),డీకాక్(35), చివర్లో హార్దిక్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు.
అనంతరం ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది.అయ్యర్(3), పంత్(7), మున్రో(3)లు పూర్తిగా నిరాశపరిచారు. ముంబై బౌలర్ల కట్టదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వరుసగా వికెట్ల తీయడంతో ఢిల్లీ కుదేలైంది. ఈ మ్యాచ్ విజయంతో ముంబై ఖాతో మరో విజయం చేరింది.