Friday, March 29, 2024
- Advertisement -

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమానిని అరెస్ట్ చేసిన పోలీసులు

- Advertisement -

ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని నెస్ వాడియా అరెస్ట్ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే… కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లో నెస్ వాడియాకు కూడా వాటా ఉంది. న‌లుగురితో క‌లిసి ఈ ఫ్రాంచైజీని కొన‌సాగిస్తున్నారు . వారిలో ఒక‌డు నెస్ వాడియా. ఆయ‌న‌ను జపాన్ పోలీసులు మంగ‌ళ‌వారం ఉద‌యం జ‌పాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన గత సంవత్సరం మార్చిలో 25 గ్రాముల మత్తు పదార్థాలతో జపాన్ లో పట్టుబడ్డారు.

దీనిపై విచార‌ణ చేప‌ట్టిన జ‌పాన్ కోర్టు ,నెస్ వాడియాకు శిక్షను ఖరారు చేశారు. అయితే ఆ మ‌త్తు పదార్థాలు కేవలం వ్యక్తిగత వాడకం కోసం తన వద్ద ఉంచుకున్నానని అప్పట్లో వాడియా వాదించారు. అయిన‌ప్ప‌టికి దీనిని తీవ్ర చ‌ర్య‌గా ప‌రిగ‌ణించిన జపాన్ కోర్టు నెస్ వాడియాకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. నెస్ వాడియాపై ఇటు ఐపీఎల్ సంస్థ కాని , వాడియా గ్రూప్ ఇంకా స్పందించలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -