మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ క్రికెట్లోనే కాదు ప్రపంచ క్రికెట్లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియాకు రెండు ప్రపంచ కప్లను అందించిన ధోనికి చాలామంది అభిమానులు ఉన్నారు. ధోనిని ఎంతలా ఇష్టపడతారో , ధోని భార్య సాక్షిసింగ్ను , వారి కూతురును కూడా అంతే ఇష్టపడుతారు అభిమానులు. వారిని సొంత కుటుంబంలా ఫీల్ అవుతుంటారు.
అయితే ధోని భార్య సాక్షిసింగ్ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా ఆమె ట్విట్టర్లో చేసిన పోస్ట్ ఇప్పుడు వివాదంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు మోను కుమార్ తో కలిసి దిగిన ఒక ఫోటోను సాక్షి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. బట్టతల ఉన్న మోను కుమార్ బోడి గుండును ముద్దు పెట్టుకున్న ఫోటోను ఆమె పోస్ట్ చేశారు. ఈ పోస్ట్పై నెటిజన్లతో పాటు, ధోని అభిమానులు సైతం మండిపడుతున్నారు.
సమాజంలో ప్రముఖ వ్యక్తికి భార్యగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదా అంటూ సాక్షిని తెగ ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. కొందరు దీనిపై పాజిటివ్గా కూడా స్పందించడం విశేషం. మరి కొందరు సాక్షి ఇలా దొరికిపోయింది ఏంటాబ్బా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ పోస్ట్ మాత్రం సాక్షి ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా ఉంది. ప్రస్తుతం ఈ ట్విట్కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Advertisement -
ధోని భార్య ఇలా దొరికిపోయింది ఏంటీ..!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -