Thursday, April 25, 2024
- Advertisement -

మ‌రో సారి దేశ భ‌క్తిని చాటుకున్న ధోని..

- Advertisement -

టీమిండియా ఆట‌గాడు మ‌హేంద్ర‌సింగ్ ధోనీపై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంశ‌లు కురిపిస్తున్నారు అభిమానులు. మైదానంలో అంకిత భావంతో ఎలా ఉంటాడో దేశ భ‌క్తి విష‌యంలోకూడా అంత‌కంటే అంకిత భావంతో ఉంటారు. న్యాజిలాండ్‌తో జ‌రిగిన మూడో టీ20లో మ‌రో సారి త‌న దేశ‌భ‌క్తిని చాటుకున్నారు ధోనీ.

అభిమానులు ప‌లు సంద‌ర్భాల్లో ధోనిని క‌ల‌వ‌డానికి వ‌స్తుంటారు. వారిని అభిమానంగా రిసీవ్ చేసుకుంటారు ధోని. దివారం న్యూజిలాండ్‌తో జరిగిన విచిత్రమైన ఘటనతో జాతి గౌరవాన్ని కాపాడటమే కాక, వీక్షకుల మనస్సులను మరోసారి గెలుచుకున్నాడు. కివీస్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఒక అభిమాని భద్రతను ఛేదించుకొని గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. అతను నేరుగా ధోని వద్దకు వెళ్లి పాదాభివందనం చేశాడు.

అయితే కాళ్లకు నమస్కరించే సమయంలో అతని చేతిలో జెండా నేలమీద పడబోతుండటంతో ధోనీ దానిని వెంటనే అందుకుని పైకి లేపాడు. దీన్ని ప‌ట్టించుకోని అభిమాని మైదానంలో ప‌రుగులు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. త్రివర్ణ పతాకాన్ని నేలకు తగలకుండా ‘లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌’ ధోని దానిపై తన గౌరవాన్ని ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది. ఆ క్షణం మ్యాచ్‌లో ‘మూమెంట్‌ ఆఫ్‌ ద డే’గా నిలిచింది.

https://twitter.com/AkshayVandure1/status/1094791619927203841

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -