- Advertisement -
అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అవుటైయ్యాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా కోహ్లి వివాదాస్పద రీతిలో పెవిలియన్ చేరాడు. కోహ్లి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకండ్ స్లిప్లో ఉన్న హ్యాండ్స్కోంబ్ చేతిలో పడింది. బంతి నేలకు తాకినట్లుగా అనిపించడంతో ఫీల్డ్ అంపైర్లు.. థర్డ్ అంపైర్ను సమీక్ష కోరారు.
పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్ కోహ్లిని ఔట్గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంఅందరిని ఆశ్చర్యపరిచింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్గా బ్యాట్స్మన్కు ఫేవర్గా ఇవ్వాల్సి ఉన్నప్పటికి థర్డ్ అంపైర్ కోహ్లిని అవుట్గా ప్రకటించారు. ఈ నిర్ణయంపై కోహ్లి కూడా అసహనం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు.