Thursday, March 28, 2024
- Advertisement -

పి.వి.సింధుకు పద్మ భూషణ్… మేరీ కోమ్‌ కు పద్మవిభూషణ్‌‌

- Advertisement -

తెలుగుతేజం, బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ పీవీ సీంధు ఖాతాలో మరో అత్యున్నత అవార్డు చేరే అవకాశం ఉంది. దేశంలో అత్యున్నత మూడో పురష్కారమైన పద్మభూషణ్ కోసం సింధు పేరును క్రీడల శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ఆమెకు అవార్డును ఇవ్వాలంటూ, కేంద్రానికి సిఫార్సులు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లో సింధు స్వర్ణం సాధించి చరిత్ర నెలకొల్పింది.

2015లో కేంద్ర ప్రభుత్వం పీవీ సింధును పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. వాస్తవానికి పద్మభూషణ్‌ అవార్డు కోసం పీవీ సింధు పేరును 2017లో క్రీడాశాఖ ప్రతిపాందించినప్పటికీ… అవార్డుల కమిటీ ఎంపిక చేయలేదు. అయితే ఇటీవల సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను గెలవడంతో వచ్చే ఏడాది ఈ పురస్కారం అందుకోవడం గ్యారంటీ.

ఇదే సమయంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ కోసం ఆరుసార్లు వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ గా నిలిచిన మేరీ కోమ్ పేరును కూడా క్రీడా శాఖ సిఫార్సు చేసినట్టు సమాచారం. తొలిసారిగా క్రీడా శాఖ పూర్తిగా మహిళలతోనే సిఫార్సు జాబితాను తయారు చేసినట్టు తెలుస్తోంది.మేరీకోమ్‌ను 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్‌ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.

సింధూ, మేరీ కోమ్ లతో పాటు మరో ఏడుగురు మహిళా అథ్లెట్ల పేర్లను కేంద్ర క్రీడాశాఖ పద్మ అవార్డులకు సిఫారసు చేసింది. వారిలో
క్రికెటర్ హర్మన్ ప్రీత్ సింగ్, హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంఫాల్, రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా, షూటర్ సుమా శిరూర్, మౌంటెనీర్లు తాషి, సుంగ్లీ మాలిక్ పేర్లను పద్మశ్రీకి సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -