- Advertisement -
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ బాబర్ ఆజం బద్దలుకొట్టాడు.సోమవారం కరాచీలో శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో బాబర్ అజామ్ శతకంతో మెరిశాడు. 105 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సర్లతో 115 పరుగులు సాధించాడు. దాంతో వన్డేల్లో 11వ సెంచరీ సాధించాడు.
ఈ ఫీట్ అందుకోవడానికి కోహ్లీకి 82 ఇన్నింగ్స్ పట్టగా… బాబర్ కేవలం 70 ఇన్నింగ్స్ లలోనే ఈ ఘనతను సాధించాడు. 64 ఇన్నింగ్స్ లలోనే 11 సెంచరీలు సాధించిన దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా ఈ జాబితాలో తొలి స్థానంలో ఉండగా… మరో సౌతాఫ్రికా ప్లేయర్ డీకాక్ రెండో స్థానంలో (65 ఇన్నింగ్స్) కొనసాగుతున్నాడు. ఆమ్లా తన 64వ ఇన్నింగ్స్లో 11వ వన్డే సెంచరీని సాధిస్తే, డీకాక్ 65వ ఇన్నింగ్స్లు దీన్ని నమోదు చేశాడు.బాబర్ మూడో స్థానానికి చేరుకోవడంతో… కోహ్లీ నాలుగో స్థానానికి పడిపోయాడు.