- Advertisement -
ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో భాగంగా నిన్న ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇస్టీండీస్ చేతిలో ఘోరంగా ఓటమి పాలు కావడంతో పాక్ జట్టుపై విమర్శలు రావడంతో ఇంగ్లండుతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది. పాక్ విజయంపై ఆ దేశ అభిమానులు సోషల్ మీడియాలో ఇండియన్లపై జోకులు పేలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. పాక్ టీం గెలిచాక ఇండియన్ క్రికెట్ ప్లేయర్లు, ఫ్యాన్ల రియాక్షన్ ఇది అంటూ.. ట్వీట్లు చేస్తున్నారు. అయితే భారత్ అభిమానులుకూడా ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.గతంలో వచ్చిన మౌకా.. మౌకా.. యాడ్స్ చూసుకోవాలని.. ఎక్కువగా చూస్తే.. గట్టిగా రిప్లై ఇవ్వాల్సి వస్తుందని ఇండియన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.