Thursday, March 28, 2024
- Advertisement -

ధోనీ గ్రేట్.. అందుకే చెన్నై కొనుగోలు చేసింది : పీయూష్ చావ్లా

- Advertisement -

ఐపీఎల్ వేలం 2019 లో ఎక్కివ రేటుకి పలిగిన భారత ప్లేయర్ పీయూష్ చావ్లా. ఐపీఎల్లో చెన్నైకి ఆడడం ఆనందంగా ఉందని, కెప్టెన్సీలో ధోనీని మించినవారు లేరని అన్నాడు. ధోనీ కెప్టెన్సీలో బరిలోకి దిగడం ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డాడు. గురువారం కోల్‌కతాలో జరిగిన ఐపీఎల్ వేలంలో చావ్లాను రూ.6.75 కోట్లకు చెన్నై కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

చెన్నై వికెట్ తన బౌలింగ్‌కు బాగా సూటవుతుందని చావ్లా అన్నాడు. మరోవైపు 12 ఏళ్ల కిందట అక్కడ క్లబ్ క్రికెట్ ఆడి ఉండటం తనకు ప్లస్ పాయింట్ అని అన్నాడు. మరోవైపు ప్లేయింగ్ లెవన్‌లో తను ఉండటం గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందని వ్యాఖ్యానించాడు. ఇక ఐపీఎల్ లాంటి మెగాటోర్నీలో ఎవరైన పటిష్టమైన జట్టు, కెప్టెన్ తరపున ఆడాలని కోరుకుంటారని తెలిపాడు. చెన్నై, ధోనీ అలాంటి కోవకిందకే వస్తారని తెలిపాడు. మరోవైపు తనను కోల్‌కతా నైట్‌రైడర్స్ రిలీజ్ చేయడం వెనుక గల కారణాన్ని చావ్లా వివరించాడు.

కోల్‌కతాలో ఇప్పటికే కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్ రూపంలో క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారని, ఈక్రమంలో మూడో స్పిన్నర్ అవసరం లేదని టీమ్ మేనేజ్‌మెంట్ తనతో చెప్పారని అన్నాడు. ఇక ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా) వికెట్ స్పిన్‌కు అంతగా సహకరించడ లేదని అన్నాడు. నిన్న జరిగిన ఐపీఎల్ వేలంలో చావ్లాతోపాటు శామ్ కర్రాన్‌ను రూ.5.5 కోట్లకు చెన్నై కొన్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -