Saturday, April 20, 2024
- Advertisement -

నెటిజ‌న్ల దెబ్బ‌కు దొగొచ్చిన సానియా మీర్జా..

- Advertisement -

నెటిజ‌న్ల దెబ్బ‌కు సానియామీర్జా దిగొచ్చింది. పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడిపై దేశం అంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. ప‌లువురు క్రికెట‌ర్లు ఈ దాడిని ఖండిస్తూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్‌లు పెట్టారు. కాని భార‌త టెన్నిస్ స్టార్‌, పాకిస్థాన్‌ క్రికెట‌ర్ షోయెబ్ మాలిక్ భార్య సానియా మీర్జా స్పందించ‌క‌పోవ‌డంపై నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమెపై ట్రోలింగ్‌కు పాల్ప‌డుతున్నారు.తాజాగా తీసుకున్న‌ త‌న ఫోటోను సానియా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో పుల్వామా ఉగ్ర‌దాడి గురించి స్పందించ‌కుండా ఇలా ఫోటోలు పోస్ట్ చేస్తావా? అంటూ ప‌లువురు నెటిజ‌న్లు సానియా దేశ‌భ‌క్తిని ప్ర‌శ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

నీ ఫోటో చూసే ఆస‌క్తి మాకు లేదు. అంత పెద్ద దాడి జ‌రిగితే దాని గురించి క‌నీసం స్పందించ‌కుండా ఇలా ఫోటోలు అప్‌లోడ్ చేస్తావా,సిగ్గులేదు, స్వార్థం.. నువ్వు భార‌తీయురాలివేనా? దేశ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌పై జ‌రిగిన దాడిని ప‌ట్టించుకోవా,ఆమె పాకిస్థాన్‌కు చెందిన మ‌హిళ‌. ఈ దాడి గురించి స్పందించ‌డానికి ఆమె ఇష్ట‌ప‌డదు` అంటూ చాలా మంది నెటిజ‌న్లు ఆమెపై సోష‌ల్ మీడియా వేదిక‌గా దాడికి దిగుతున్నారు.

దీంతో సానియా ఉగ్ర‌దాడిపై స్పందించింది.పుల్వామాలో సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌పై జరిగిన దాడి నాకు ఎంతో బాధ‌ను క‌లిగించింది. ఆ జ‌వాన్ల కుటుంబాల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నా. ఈ ప్రపంచంలో ఉగ్ర‌వాదానికి చోటు ఉండ‌కూడ‌దు. శాంతి కోసం ప్రార్థించండి` అని సానియా ట్వీట్ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -